Sunday, July 19, 2015

పాదుకాపట్టాభిషేకం- ఓ చిన్ని సరదా కథ

అందరికీ తెలిసిన విషయంలోనుంచి  ఓ కొత్త విశేషాన్ని.. వెలికి తీసి చూపిస్తే.. సహృదయులైన చదువరురులకు కాస్త గిలిగింతలు పెట్టినట్లుంటుందని హాస్య విశ్లేషకులు అంటుంటారు.

రాములవారితోసహా అడవులబాట పట్టిన ఆయన పాదుకల్లో వామపాదుక (అతివాది) స్వామివారిమీద విసుక్కున్నదిట. 'దేవుడు కదా అని సంబరపడితే.. ఇదేమిటీ..  ఈయనగారు మనల్ని ఇలా ముళ్ళ డొంకలవెంట తిప్పే పని పెట్టుకొన్నాడు!' .. ఆవటా అని.
ఆ మాట విన్న కుడిపాదరక్ష 'తొందర పడి బైటికి ఏదీ అనకు! స్వామిని నమ్ముకున్నవారు ఎన్నటికీ చెడరు' అని మందలించిందిట.
తదనంతరకాలంలో భరతుడు రామపాదుకలను నెత్తిమీద పెట్టుకుని అయోధ్య వీధుల గుండా ఊరేగిస్తూ తీసుకుని వెళ్ళి నేరుగా సింహాసనంమీదే ప్రతిష్ఠించిన కథ మనందరికీ  తెలుసు.

అప్పుడు సంబరపడుతూ అందిట కుడి పాదంతో ఎడం పాదం 'నువ్వన్న మాట నిజమే సుమా! స్వామివారి మహిమ సామాన్యమైనది కాదు!  ఏ పాదరక్షలకూ పట్టని పట్టాభిషేకయోగం మనకు పట్టింది' అని!

-కర్లపాలెం హనుమంతరావు
***

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...