Sunday, December 19, 2021

వెల్లుల్లి .. నీరుల్లి - కథలు - కర్లపాలెం హనుమంతరావు ( ఒక జానపద కథ ఆధారంగా )

వెల్లుల్లి .. నీరుల్లి - కథలు 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఒక జానపద కథ ఆధారంగా ) 



పూర్వం మన దేశంలో అవుమాంసం తినేవారు. మన కనేక విధాల సహాయపడే ఆవును చంపి తినడం న్యాయమేనా అని ఒక రోజున రాజు గారు ఆలోచించారు. ఆవును చంపడం చాలా తప్పని తోచింది రాజుగారికి, తక్షణమే మంత్రిని పిలిచి గోమాంస మెవరూ తినకూడదనీ, తినిన వారికి ఉరి శిక్ష విధించబడుననీ దండోరా వేయించమని ఆజ్ఞాపించారు.


ప్రజలందరికీ రాజాజ్ఞ ప్రకటితమైంది. అందరూ గోవును చంపడం మానేశారు. కాని ఒకాయన గోమాంసం తినకుండా ఉండలేకపోయాడు. ఎవరూ చూడకుండా రహస్యంగా ఆవును చంపేసి దాని గిట్టలు భూమిలో పాతేశాడు. ఆయన గిట్టలు పాతిపెట్టిన చోటునుండి, ఒక మొలక వచ్చింది.

ఆడే వెల్లుల్లి, ఆవు గిట్టలనుండి పుట్టింది. కనక వాటిలాగా వెలుల్లి  నాలుపాయలుగా ఉంటుంది. ఇదీ వెల్లుల్లి జీవిత రహస్యం.


ఇంక నీరుల్లి సంగతి: 


ఒకరోజున కాయగూరలన్నీ సభ చేశాయి. 

వంకాయ లేచి సభికులనందరినీ ఉద్దే శిస్తూ ఇలా అంది.


"స్నేహితులారా ! ఇవాళ మన మందరం ఇక్కడ కలుసుకున్నందుకు చాలా సంతోషం. అన్ని దేశాలకీ రాజు మానవలోకంలోనూ, దేవలోకంలోనూ కూడా ఉన్నారు. ఒక్క మనలోనే లేరు. అన్ని దేశాల వలె మనకికూడా రాజుంటే బాగుం టుంది.”


అందరూ వంకాయఅభిప్రాయానికి సంతోషించారు. గుమ్మడి, పొట్ల కాయలు వచ్చి వంకాయ ఉద్దేశాన్ని బలపరిచాయి.


మిరపకాయ లేచి, “వంకాయగారు చెప్పినది, సత్యమే. మనకికూడా రాజు కావాలి. ఈ విష యం అందరూ గుర్తించి ఒప్పుకొన్నందుకు చాలా సంతోషం. కాని రా జెవరిని చెయ్యాలో చర్చించాల్సిన విషయం.” అని చెప్పి కూర్చుంది.


మిరపకాయ తెలివితేటల కందరూ మెచ్చుకున్నారు. తర్వాత వంకాయ, "భగవంతుడు పుట్టుకతో టే నాకు కిరీట మిచ్చాడు. మీ అందరికన్న నాలో సార మెక్కువ. రుచి అధికము. వంకాయ ఇష్టము లేనివా రెవరైనా ఉన్నారా? కనక నేను రాజపదవి కర్హుడనని తలచుచున్నాను” అని పలికింది.


పొట్లకాయ వెంటనే లేచి, “వంకా యగారు పొరబడినారు. నేను చాలా భారీగా ఉంటాను. అందంగా ఉంటాను. నన్ను మర్చిపోయి, తనకు రాజలక్షణా లున్నా యనుకుని అలా చెప్పి ఉంటా రు” అని యథాస్థానంలో కూర్చుంది.


రాజెవరో తేలలేదు. ఎవరికివారే తాము రాజపదవికితగుదు మని వాదించారు. గుమ్మిడికాయ, “సోదరులా రా మన మిట్లు వాదించుకోవడం అనవసరంగా  దెబ్బలాట?  మనని పుట్టించిన బ్రహ్మ దేవుణ్ణి నిర్ణయించమందాం,' అంది. దానికి అందరూ అంగీకరించారు.


బ్రహ్మ దేవునివద్దకుపయాణమైవెళ్లారు. మార్గమధ్యంలోనే దొండకాయ పండిపోయింది. పొట్లకాయ కుళ్లి పోయింది. మిరపకాయ, వంకాయ  ఒడిలిపోయాయి. అలాగే అన్నీ కలిసి బ్రహ్మదేవుడిదగ్గర కెళ్లాయి.


బ్రహ్మ దేవుడు వారి తగవు విని, "మీకూ పుట్టిందీ ఈ జబ్బు! పదవీవ్యా మోహం, మానవులకే అనుకున్నా; నిద్రకళ్లతో సృష్టించి ఉంటా మిమ్మల్ని" అని నసుక్కున్నాడు. 


బ్రహ్మదేవుడు గుమ్మడిని   రాజు చేద్దా మనుకున్నాడు. కాని తనయెదుట నిర్లక్ష్యంగా అంతఠీవిగా కూర్చున్నందుకాయనకి కోపం వచ్చింది. నలుగురి మధ్యనూ ఒదిగిఉన్న ఉల్లిపాయని ఆయన చూశాడు. దానిని వినమ్రతకి బ్రహ్మదేవుడెంతో సంతోషించాడు. ఉల్లిపాయని నిర్ణయించాడు. అందరికీ కోపం వచ్చింది. 'ఛీ ఇదా మా రాజ'ని అన్నీ చీదరించుకున్నాయి. అప్పుడు బ్రహ్మదేవుడు ఉల్లికి పల్చటి రేకులాటి వస్త్రాలిచ్చాడు. శంఖచక్రా లిచ్చాడు. అందుకనే ఉల్లి నడ్డంగా తరిగితే చక్రం, నిలువుగా తరిగితే శంఖం కనిపిస్తాయి.


***

- కర్లపాలెం హనుమంతరావు 

( ఒక జానపద కథ ఆధారంగా ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...